దొంగ దొరికాడు

27 Jan, 2015 20:25 IST|Sakshi

పశ్చిమగోదావరి: నాలుగు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో దొంగ తనాలకు పాల్పడిన నిందితుడిని ఎట్టకేలకు మామిడి కుదురులో పోలీసులు పట్టుకున్నారు. రాజోలు మండలం చింతపల్లి గ్రామానికి చెందిన గుడిసే విజయబాబు(35) బాగా చేయితీరిగిన దొంగ.

దీంతో పోలీసులు పక్కా ప్రణాళిక ప్రకారం విజయబాబును అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 5.28 లక్షల విలువైన బంగారం, 50 గ్రాముల వెండి ఆభరణాలు, డెల్ ట్యాబ్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని బుధవారం కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు