మదనపల్లెలోమహిళా దొంగ అరెస్ట్

19 Jan, 2016 11:32 IST|Sakshi
మదనపల్లెలోమహిళా దొంగ అరెస్ట్
మదనపల్లె : చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికుల బ్యాగులు చోరీ చేస్తున్న మహిళను పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి రూ.5 లక్షల రూపాయల విలువైన 250 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. బి. కొత్త కోటకు చెందిన పఠాన్ రహంతుల్లా భార్య నౌహిరా(40) బస్టాండులో ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకుని చోరీలను పాల్పడుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం కాపు కాసిన పోలీసులు ఆమెను పట్టుకున్నారు. అరెస్ట్‌ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మరిన్ని వార్తలు