పట్టపగలే చోరీ

23 Sep, 2015 18:19 IST|Sakshi

తాడేపల్లి (గుంటూరు): పట్టపగలే ఇంట్లో దొంగలుపడి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కంచనపల్లి గ్రామంలోని అరవింద స్కూల్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన దామెర్ల మీనాక్షి స్థానిక విజయా బ్యాంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తోంది.

రోజులాగే ఇంటికి తాళం వేసి బ్యాంకుకు వెళ్లి తిరిగి భోజన సమయంలో ఇంటికి వచ్చింది. అప్పటికే తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో క్లూస్‌టీంతో సహా రంగంలోకి దిగిన పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి 350 గ్రాముల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు తెల్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు