విజయనగరం : విజయనగరం జిల్లా రామభద్రాపురం మండల కేంద్రంలోని నారాయణ కోల్డ్ స్టోరేజిలో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. గురువారం ఉదయం గుర్తించిన యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాదాపు రూ. 4లక్షల మేర చోరీ జరిగినట్టు సమాచారం. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, జాగిలాలతో గాలింపు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
(రామభద్రాపురం)