రూ.20 లక్షల విలువైన కోళ్లు చోరీ

6 Apr, 2016 08:49 IST|Sakshi

గ్రామ శివారులో ఉన్న కోళ్లఫాంలపై దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు ఫాంలో ఉన్న రూ. 20 లక్షల విలువైన కోళ్లను దోచుకెళ్లారు. రెండు ఫాంలను ధ్వంసం చేశారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం దూలిపాళ్ల వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామ శివారులోని ఓ వివాదాస్పద స్థలంలో ఉన్న రెండు కోళ్లఫాంలపై దాడి చేసిన దుండగులు అందులో ఉన్న రూ.20 లక్షల విలువైన కోళ్లను ఎత్తుకెళ్లారు. దీంతో బాదితుడు పోలీసులను ఆశ్రయించాడు.
 

మరిన్ని వార్తలు