చోరీలకు పాల్పడుతున్న యువకుడి అరెస్ట్

2 Dec, 2015 16:54 IST|Sakshi

అనంతపురం: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని బుధవారం అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో పలు దొంగతనాలకు పాల్పడిన సయ్యద్ మహబూబ్ భాషా(22) అనే దొంగని పోలీసులు అదుపులోకి తీసుకుని... అతని వద్ద నుంచి రూ.మూడున్నర లక్షల విలువైన 12 తులాల బంగారం, 4 పట్టు చీరలను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

 

>
మరిన్ని వార్తలు