చిపురుపల్లిలోని సాయిబాబా ఆలయంలో చోరీ

10 Nov, 2013 08:44 IST|Sakshi

విజయనగరం జిల్లా చిపురుపల్లిలోని సాయిబాబా దేవాలయంలో గత అర్థరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. దాంతో సాయిబాబ గుడి పూజారి, భక్తులు ఆదివారం ఉదయం పోలీసులను ఆశ్రయించారు. దేవునికి చెందిన కిలో వెండి ఆభరణాలతోపాటు రూ. 20 వేల నగదును దొంగలు అపహరించుకు పోయారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు