తుప్రాన్ పరిసర ప్రాంతాల్లో దొంగల బీభత్సం

15 Jul, 2013 16:29 IST|Sakshi

తుప్రాన్ పరిసర ప్రాంతాల్లో గత ఆర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు.  దొంగలు వరుస చోరీలకు పాల్పడుతూ స్థానికులను భయాందోళనలకు గురి చేస్తున్నారు. దాంతో స్థానికులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయినా వారు నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహారిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే స్థానికంగా దొంగలు ఓ ఇంట్లో చొరబడి రూ. 1.75 లక్షలను అపహరించారు.

 

కాగా హైదరాబాద్లోని కర్మాన్ఘాట్ సాయినగర్లో కోదండరామ్ ఆలయంలో గత అర్థరాత్రి చోరీ జరిగింది. అమ్మవారి ముక్కుపుడక, మంగళసూత్రాన్ని దుండగులు అపహరించారు. ఉదయం పూజారీ గుడికి వచ్చి చూడగా ఆలయంలో చోరీ జరిగిందని గుర్తించి స్థానికులకు ఆ విషయన్ని తెలిపాడు. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి చోరీ జరిగిన తీరు పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు