శ్రీకాకుళం జిల్లాలో ఘోరం

5 Oct, 2017 13:23 IST|Sakshi

సాక్షి, లావేరు: శ్రీకాకుళం జిల్లాలో ఘోరం జరిగింది. దుస్తులు ఉతకడానికి చెరువుకు వెళ్లిన ముగ్గురు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందారు. ఈ సంఘటన జిల్లాలోని లావేరు మండలం గుర్రాలపాలెంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన పతివాడ నాగమ్మ(45) ఆమె కూతురు శిరీష(13)తో పాటు పక్కింటి బాలిక బండారి దుర్గ(16)తో కలిసి గ్రామ శివారులోని చెరువులో దుస్తులు ఉతకడానికి వెళ్లింది.

ఈ క్రమంలో చెరువులో దిగి ఆడుకుంటున్న శిరీష ప్రమాదవశాత్తు నీట మునిగిపోయింది. ఆమెను రక్షించే క్రమంలో తల్లి నాగమ్మతో పాటు దుర్గ కూడా నీట మునిగి మృతి చెందారు. ఈ  ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

మరిన్ని వార్తలు