‘అనకాపల్లిలో మూడు పారిశ్రామిక పార్కులు’

24 Jun, 2015 18:18 IST|Sakshi

అనకాపల్లి: విశాఖ జిల్లా అనకాపల్లి మండల పరిధిలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ తలపెట్టిన పారిశ్రామిక పార్కుల కోసం ఆ సంస్థ ఈడీ రఘునాథ్ బుధవారం స్థల పరిశీలన చేశారు. మండల పరిధిలోని వల్లూరు, మారేడుపూడి, కొంచంగి, కుండ్రం, వేట జంగంపాలెం, సంపత్‌పురం, కోడూరు గ్రామాల పరిధిలో సుమారు 2,500 ఎకరాలను సేకరించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ భూమిలో పారిశ్రామిక పార్కు, లాజిస్టిక్స్ పార్కు, ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించి సేకరించాల్సిన భూములను ఈడీ రఘునాథ్, స్థానిక ఆర్డీవో పద్మావతి, ఎమ్మెల్యే పీల గోవింద్‌తో కలసి పరిశీలించారు.

మరిన్ని వార్తలు