చంచల్‌గూడ వద్ద మూడంచెల భారీ భద్రత

24 Sep, 2013 09:18 IST|Sakshi

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత చంచలగూడ జైలు నుంచి విడుదల కానున్నారు. దాంతో తమ ప్రియతమ నేతను చూసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చంచలగూడ జైలు వద్దకు తరలి వస్తున్నారు. దాంతో పోలీసులు జైలు వద్ద మూడంచెల భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఒక కంపెనీ బీఎస్ఎఫ్, మూడు ప్లాంటూన్స్ ఏపీఎస్పీ...తో పాటు సౌత్ జోన్లోని 17 పోలీస్ స్టేషన్లకు సంబంధించి సిబ్బంది అక్కడ మోహరించారు. ముళ్లకంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు.

>
మరిన్ని వార్తలు