ముగ్గురు మహిళలు ఆత్మహత్య

22 Jan, 2015 11:48 IST|Sakshi

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధి లో గురువారం ముగ్గురు మహిళలు బలవన్మరణానికి పాల్పడ్డారు.  రైల్వే బ్రిడ్జి సమీపంలో కృష్ణానదిలో దూకి వారు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు నదిలో నుంచి మృతదేహాలను వెలికితీశారు. మృతులను ఒకే కుటుంబానికి చెందిన వారిగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కృష్ణాజిల్లాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు