కుందూనదిలో ముగ్గురు మహిళల గల్లంతు

3 Oct, 2017 11:53 IST|Sakshi

సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా కుందూ నదిలో ముగ్గురు మహిళలు గల్లంతయ్యారు. ఈ విషాద సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. రెండు రోజులుగా కర్నూలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లడమేగాక నదుల్లోకి కూడా భారీగా వరద నీరు వస్తోంది. దీంతో గడివేముల మండలం గడిగరేవుల దగ్గర కుందూనదిలో ప్రమాదవశాత్తూ ముగ్గురు మహిళలు గల్లంతయ్యారు.

వీరిలో ఓ మహిళ మృతదేహం లభ్యం కాగా మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. సమాచారమందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మిగతా ఇద్దరి కోసం విస్తృతంగా గాలింపు పడుతున్నారు.

మరిన్ని వార్తలు