గ్రామకంఠాలపై జీవో

28 May, 2015 01:52 IST|Sakshi

రిజిస్ట్రేషన్  చట్టంలోని సెక్షన్ 22-ఎ నుంచి మినహాయిస్తూ  ఉత్తర్వు
 
 హైదరాబాద్: ప్రజల ఉమ్మడి అవసరాలకు ఉద్దేశించిన గ్రామ కంఠం భూములు ఇక మాయం కానున్నాయి. గ్రామ ఉమ్మడి అవసరాల నిమిత్తం బ్రిటిష్ కాలంలోనే గ్రామ కంఠాలను ఏర్పాటు చేయగా వీటిని రక్షించాల్సిన ప్రభుత్వం భక్షించేందుకు మార్గం సుగమం చేసింది.

రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-ఎ నుంచి గ్రామ కంఠం భూములను మినహాయిం చాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ రెవెన్యూ శాఖ బుధవారం జారీ చేసిన జీవో 187 ఇందుకు నిదర్శనం.  గ్రామ కంఠం భూములను రిజిస్ట్రేషన్  చట్టంలోని సెక్షన్ 22-ఎ నుంచి మినహాయిస్తూ గత ఫిబ్రవరి 16వ తేదీ జీవో 56 జారీ చేసింది.
 
 

మరిన్ని వార్తలు