నిద్రిస్తున్న వ్యక్తి పైకి దూసుకెళ్లిన టిప్పర్

12 Jan, 2016 12:00 IST|Sakshi

కాపలాగా నిద్రిస్తున్న వ్యక్తిపైకి టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్కక్తి  టిప్పర్ కింద నుజ్జునుజ్జయి ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం దుద్దెబండ వద్ద మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. హంద్రీనీవా కాలువ పనుల వద్ద వెంకటరాములుఅనే వ్యక్తి రాత్రి పూట కాపలా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో నిద్రిస్తున్న అతడిపైకి మంగళవారం తెల్లవారుజామున ఓ టిప్పర్ ఎక్కేసింది. దీంతో అతడు మృతి చెందాడు. పోలీసులు టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

 

మరిన్ని వార్తలు