2014లో వెంకన్న హుండీ ఆదాయం రూ. 831.90 కోట్లు

31 Dec, 2014 21:56 IST|Sakshi
2014లో వెంకన్న హుండీ ఆదాయం రూ. 831.90 కోట్లు

తిరుమల: 2014 ఏడాదిలో తిరుమల వెంకన్న హుండీ ఆదాయం రూ. 831.90 కోట్లు వచ్చిందని బుధవారం తిరుమలలో టీటీడీ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఏడాది శ్రీవారిని 2 కోట్ల 26 లక్షల 12 వేల 628 మంది దర్శించుకున్నారని వెల్లడించారు. కోటి 15 లక్షల మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పించారని చెప్పారు. దాదాపు 9 కోట్ల లడ్డూలు విక్రయించామని టీటీడీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు