శ్రీవారి స్వర్ణరథం ట్రయల్ రన్లో అపశ్రుతి

30 Sep, 2013 12:05 IST|Sakshi

తిరుమల: తిరుమలేశుని కైంకర్యసేవ కోసం తయారు చేసిన కొత్త స్వర్ణరథం ట్రయల్ రన్లో అపశ్రుతి చోటు చేసుకుంది. సోమవారం ఉదయం టీటీడీ అధికారులు... ఆలయ వీధుల్లో ప్రయోగాత్మకంగా ఊరేగించారు. ఎస్వీ మ్యూజియం నుంచి మాడవీధుల్లో రథ మండపానికి తరలించారు. సుమారు గంట సమయం పట్టింది. అయితే రథం తరలిస్తుండగా ఎస్వీ మ్యూజియం మలుపు వద్ద భూమిలోకి కూరుకుపోయింది. రథచక్రాలు మట్టిలోకి దిగబడిపోయాయి. దీంతో క్రేన్ సహాయంతో రథాన్ని టీటీడీ సిబ్బంది బయటకు తీశారు.

కాగా స్వర్ణ రథం ఎత్తు 32 అడుగులు. బరువు 28 టన్నులు. ఇటువంటి స్వర్ణరథం దేశంలో మరెక్కడా లేదు. రథం తయారీలో 74 కిలోల బంగారం, 2,900 కిలోల రాగి, 25 టన్నుల దారుచెక్క, ఇనుము వినియోగించారు. 18 అడుగుల గేజ్ కలిగిన రాగిపై 9సార్లు బంగారుపూత పూశారు. ఇందుకోసం రూ.24.34 కోట్లు వ్యయం అయ్యింది.

>
మరిన్ని వార్తలు