టీటీడీ గోశాలకు తరలించిన అధికారులు
సాక్షి, చిత్తూరు : తిరుమలలో శ్రీవారి తిరునామంతో ఉన్న గోవు కనిపించింది. లాక్డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం ఏడు కొండలపై జంతువులు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఇదే సమయంలో తిరునామం గుర్తుతో ఉన్న గోవు కనిపించడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ గోవును అధికారులు టీటీడీ గోశాలకు తరలించారు.