తిరుమలలో శ్రీవారి తిరునామంతో గోవు

29 Apr, 2020 16:57 IST|Sakshi

టీటీడీ గోశాలకు తరలించిన అధికారులు

సాక్షి, చిత్తూరు : తిరుమలలో శ్రీవారి తిరునామంతో ఉన్న గోవు కనిపించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రస్తుతం ఏడు కొండలపై జంతువులు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఇదే సమయంలో తిరునామం గుర్తుతో ఉన్న గోవు కనిపించడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ గోవును అధికారులు టీటీడీ గోశాలకు తరలించారు. 

మరిన్ని వార్తలు