తిరుమలలో దొంగల హల్‌చల్‌

4 Apr, 2017 11:15 IST|Sakshi
తిరుపతి: తిరుమలలో వరస చోరీలతో దోపిడీ దొంగలు భక్తులను హడలెత్తిస్తున్నారు. సోమవారం రాత్రి టి.బి.సి కాటేజీల వద్ద గది తాళలు పగలగొట్టి, లక్ష రూపాయల విలువచేసే నగలు, నగదు, ద్విచక్రవాహనం ఎత్తుకుపోయారు.
 
అలాగే సి.ఆర్.ఒ. వద్ద ప్లాట్‌ఫాంపై నిద్రిస్తున్న భక్తురాలిపై మత్తుమందు చల్లి బంగారు గొలుసును దోచుకెళ్లారు. బాధిత భక్తుల ఫిర్యాదుతో తిరుమల క్రైం పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మరిన్ని వార్తలు