ఆ రెండురోజుల్లో శ్రీవారి ఆలయం మూసివేత

20 Dec, 2019 12:48 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం రెండురోజులు మూతపడనుంది. సూర్యగ్రహణం కారణంగా డిసెంబరు 25, 26వ తేదీల్లో 13 గంటలపాటు ఆయల తలుపులు మూసివేయనున్నారు. డిసెంబరు 25న బుధవారం రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయం తలుపులు మూసేస్తారు. డిసెంబరు 26న గురువారం నాడు ఉదయం 8.08 గంటల నుంచి 11.06 వరకు సూర్యగ్రహణం జరగనుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆరు గంటల ముందుగా అంటే బుధ‌వారం రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయం మూసివేస్తారు. సూర్యగ్రహణం ముగిసిన తర్వాత తలుపులు తెరిచి ఆలయ శుద్ధి చేపడుతారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు యథావిధిగా భక్తులకు సర్వదర్శనం ప్రారంభం కానుంది.

మరిన్ని వార్తలు