తిరుపతి కమిషనర్‌గా వినయ్‌చంద్

8 Jan, 2015 02:24 IST|Sakshi
తిరుపతి కమిషనర్‌గా వినయ్‌చంద్

తిరుపతి కార్పొరేషన్:  తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ టి.సకలారెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో 2008 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి వాడరేవు వినయ్‌చంద్‌ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఐటీడీఏ ప్రాజెక్టు డెరైక్టర్‌గా పనిచేస్తున్న వినయ్‌చంద్ జిల్లాకు సుపరిచితుడు. 2011 నుంచి 2013 వరకు మదనపల్లె సబ్ కలెక్టర్, ఆపై చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు.

తిరుపతిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో బీటెక్ చేసి ఐఏఎస్‌గా ఎంపికైన వినయ్‌చంద్‌ను తిరుపతి కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత కమిషనర్ సకలారెడ్డి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. పరిపాలనా విభాగంలో రిపోర్టు చేయూలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు