తిరుపతిని మెగా సిటీగా తీర్చిదిద్దుతాం: కేఈ

1 Sep, 2014 02:10 IST|Sakshi

తిరుమల : తిరుపతి పట్టణాన్ని మెగా సిటీగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. శేషాచల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. ఎర్రచందనం అక్రమరవాణాను అడ్డుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇద్దరు మంత్రులూ ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు.

మరిన్ని వార్తలు