నెల్లూరు(బారకాసు): నారాయణరెడ్డిపేటకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడలో టీడీపీ రూరల్ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. వీరందరికీ సీఎం చంద్రబాబు పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు.
కోడూరుపాడు కో ఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు వాల్మేటి లక్ష్మీనారాయణరెడ్డి, నెల్లూరు పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు వాల్మేటి సుధాకర్రెడ్డి, పొనుగోటి రమణారెడ్డి, వేణు, మదరి మురళి, పంపన వెంకటరమణ, ముజీఫ్, బొడ్డు సురేష్, వల్లం వెంకటేశ్వర్లు, నాగా రమణారెడ్డి, చీమకుర్తి వెంకటరమణారెడ్డి, తదితరులు పార్టీలో చేరారు.