పొగాకు రైతుల ఆందోళన

5 Apr, 2016 13:37 IST|Sakshi

మరిపాడు మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు ఎదుట పొగాకు రైతులు ఆందోళనకు దిగారు. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్‌తో నెల్లూరు-ముంబాయి రహదారిపై రాస్తారోకోకు దిగారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

 

>
మరిన్ని వార్తలు