టుడే న్యూస్‌ రౌండప్‌

29 Jan, 2018 23:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. మూడువేల కిలోమీటర్ల  సుదీర్ఘ పాదయాత్రలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని ఆయన సోమవారం వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం వద్ద దాటారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, గ్రామస్థులు వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. 

చందానగర్‌లో కుటుంబం దారుణ హత్య
సైబరాబాద్‌ పరిధిలోని శేరలింగపల్లిలో ఓ కుటుంబం హత్య గురికావడం కలకలం రేగింది. కుటుంబంలోని ముగ్గురిని దుండగులు హతమార్చారు.

ప్రజాసంకల్పయాత్ర @1000 కిలోమీటర్లు
 ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 

జగన్‌ మాట తప్పడు.. ఆశీర్వదించండి
ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తన బిడ్డ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించాలని ఆయన తల్లి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ విజ్ఞప్తి చేశారు.

పవన్‌ సమావేశంలో తోపులాట.. పలువురికి గాయాలు
 సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం హిందూపురంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది.

మరో మాజీ ఎమ్మెల్యేను త్వరలోనే చంపేస్తారు!
నల్లగొండ జిల్లాలో జరుగుతున్న వరుస హత్యలపై కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

పెళ్లికాని యువతులు.. పెరిగిన కండోమ్‌ల వాడకం
గర్భనిరోధక పద్ధతులపై పెళ్లికాని యువతులు ఇప్పుడిప్పుడే అవగాహనకు వస్తున్నారని, వారిలో కండోమ్‌ వాడకం పెరిగిందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) లో వెల్లడైంది. 

భారత్‌తో విభేదాలు ఇష్టం లేదు : చైనా
పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే) గుండా వెళ్తున్న చైనా పాకిస్తాన్‌ ఎకానమిక్‌ కారిడార్‌(సీపీఈసీ) ప్రాజెక్టుపై భారత్‌తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని సోమవారం చైనా ప్రకటించింది. 

ఆదివారం ఉచిత కాల్స్‌ రద్దు
ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌) ఆదివారం ల్యాండ్‌లైన్లకు అందిస్తున్న ఉచిత వాయిస్‌ కాలింగ్‌ ప్రయోజనాలను ఫిబ్రవరి 1 నుంచి రద్దు చేయబోతుంది. 

రొమాన్స్-కామెడీ-సెక్స్‌... పిచ్చి వర్మ
విలక్షణ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) పై ఎట్టకేలకు సంగీత దర్శకుడు కీరవాణి స్పందించారు.

'కోహ్లి..రిచర్డ్స్‌ను చూసి నేర‍్చుకో'
'ఒకవేళ సిరీస్‌ మేం గెలిచి ఉంటే  అత్యుత్తమ తుది జట్టు అన్న ప్రస్తావన వచ్చేదా?, ఊరికే కూర్చుని మాట్లాడటం కాదు.

>
మరిన్ని వార్తలు