ఈనాటి ముఖ్యాంశాలు

8 Sep, 2019 19:56 IST|Sakshi

చంద్రయాన్‌-2 ప్రయోగంలో భాగంగా చందమామకు చేరువగా వెళ్లి జాడలేకుండా పోయిన విక్రమ్‌ ల్యాండర్‌ లోకేషన్‌ను ఇస్రో గుర్తించింది. త్వరలో ల్యాండర్‌తో సంబంధాల పునురుద్ధరణ జరిగే అవకాశముందని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ వెల్లడించారు. చంద్రుని ఉపరితలంపై విక్రమ్‌ ల్యాండ్‌ అయినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ల్యాండర్‌ థర్మల్‌ ఇమేజ్‌ను ఆర్బిటర్‌ క్లిక్‌ చేసినట్టు పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌పై బీజేపీ పోస్టర్‌ వార్‌కు తెరలేపింది. కేజ్రీవాల్‌ దేశ ద్రోహులకు మద్దతిస్తారని ఆరోపిస్తూ ఆయనకు వ్యతిరేకంగా ఢిల్లీలో పలుచోట్ల బీజేపీ నేత కపిల్‌ మిశ్రా ఆధ్వర్యంలో పోస్టర్లు వెలిశాయి. ఇలాంటి వార్తల కోసం కింది వీడియో క్లిక్‌ చేయండి..

మరిన్ని వార్తలు