ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఆర్థిక సాయం ఉపసంహరణపై ప్రపంచ బ్యాంక్ స్పష్టతనిచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొంది. ఏపీ ప్రభుత్వానికి 1 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ప్రకటించింది. రవాణాశాఖలో ప్రమోషన్లు, బదిలీలు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని, ఎవరికైనా అర్హత ఉండి అన్యాయం జరిగితే నేరుగా తనను కలవొచ్చని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. నాంపల్లిలో షేక్ సద్దాం అనే యువకుడి తల నరికిన హత్యకేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య అనంతరం పోలీసు స్టేషన్లో లొంగిపోయిన మహ్మద్ గౌస్. మహ్మద్ ఇమ్రాన్లను నిందితులుగా చేర్చారు.
మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..