అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్లో భారతీయ అమెరికన్లు ఆదివారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హౌడీ, మోదీ!’కార్యక్రమం మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుంది. ఇందులో భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలిసారి ఒకే వేదికను పంచుకోబోతున్నారు. దాదాపు 50 వేల మంది హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని అమెరికాలోని అతిపెద్ద స్టేడియంలలో ఒకటైన ఎన్నార్జీ ఫుట్బాల్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కౌలుదారులను గుర్తించే ప్రసక్తే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం ఉందని.. రైతుల భూమి కాపడుతామని సీఎం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం అసెంబ్లీలో ‘ద్రవ్య వినిమయ బిల్లు’ను ప్రవేశపెట్టారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.