నేటి ముఖ్యాంశాలు

20 Jul, 2017 10:16 IST|Sakshi

డ్రగ్స్‌ కేసు
నేడు సిట్‌ ముందు విచారణకు హాజరుకానున్న కెమెరామెన్‌ శ్యామ్‌ కే నాయుడు.

ఎంసెట్‌
ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌ రెండో విడుత కౌన్సిలింగ్‌. ఈ నెల 24న సీట్ల కేటాయింపు.

రాష్ట్రపతి ఎన్నికలు
నేడు రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి. ఉదయం 11 గంటలకు ఓట్ల కౌంటింగ్‌ ప్రారంభంకానుంది. నాలుగు టేబుళ్లపై ఎనిమిది రౌండ్లపై పాటు ఓట్ల లెక్కింపు కొనసాగనుంది.

క్రికెట్‌ మహిళా ప్రపంచకప్‌
రెండో సెమీఫైనల్లో నేడు ఆస్ట్రేలియాతో తలపడనున్న భారత్‌ మహిళా క్రికెట్‌ జట్టు. డెర్బీలో మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం.

భూ కబ్జా కేసు
భూ కబ్జా కేసులో ఫిర్యాదుల స్వీకరణకు నేడు చివరి తేది. సిట్‌కు మరిన్ని వివరాలు ఇవ్వనున్న మంత్రి అయ్యన్నపాత్రుడు.

మరిన్ని వార్తలు