ఈనాటి ముఖ్యాంశాలు

6 Jul, 2019 20:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆలోచ‌నావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టులకు దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. కేవ‌లం 16 రోజుల్లోనే దాదాపు 9 ల‌క్ష‌ల మందికి పైగా అభ్యర్ధులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి శనివారం బ్రాండిక్స్‌ ఇండియా కంపెనీలో పర్యటించారు. దుస్తులు ఎగుమతి గురించి అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా హైదరాబాద్‌ చేరుకున్న భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..

మరిన్ని వార్తలు