విజయవంతం చేయాలని తలశిల పిలుపు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 268వ రోజు కూడా భీమిలి, పెందుర్తి నియోజకవర్గాల్లోని ఆనందపురం, పెందుర్తి మండలాల పరిధిలోని గ్రామాల మీదుగా సాగనుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రొగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు. 267వరోజు శనివారం ఉదయం పప్పలవానిపాలెం శివారు నుంచి ప్రారంభమైన పాదయాత్ర పప్పలవానిపాలెం క్రాస్, కోలవానిపాలెం క్రాస్, భీమన్నదొరపాలెం ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, ఎర్రవానిపాలెం క్రాస్, రామవరం మీదుగా గండిగుండం క్రాస్ వరకు 5.9 కిలోమీటర్లు సాగిందన్నారు. 268వ రోజు ఆదివారం ఉదయం ఏడున్నర గంటలకు ఆనందపురం మండలం గండిగుండం క్రాస్ నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర గండిగుండం కాలనీ, అక్కిరెడ్డిపాలెం, జుత్తాడ క్రా స్, పాత్రుళ్లునగర్, రాయవరపువానిపాలెం గ్రామాల మీదుగా సరిపల్లి కాలనీ వరకు సాగనుందన్నారు. అప్రతిహతంగా సాగుతున్న ప్రజాసంకల్ప యాత్రలో వేలాదిగా ప్రజలు, పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని తలశిల పిలుపునిచ్చారు.