నేడు జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర

4 Aug, 2018 06:59 IST|Sakshi

పాదయాత్రలో ప్రజలతో మమేకం కానున్న వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర శనివారంపిఠాపురం నియోజకవర్గంలో కొనసాగనుంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ కష్టాల్లో ఉన్న వారికి భరోసానిస్తూ దిగ్విజయంగా ముందుకు సాగుతున్న పాదయాత్ర 227 రోజుల్లో 2,645.2 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. జూన్‌ 12నరాజమహేంద్రవరంలోకి అడుగుపెట్టిన పాదయాత్ర ప్రజాదరణతో ముందుకు సాగుతోంది. పాదయాత్రలో జిల్లాలోని కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన, సామాన్య ప్రజానీకం జననేత జగన్‌మోహన్‌రెడ్డికి సమస్యలపై అర్జీలనందజేస్తున్నారు. శనివారం గొల్లప్రోలు మండలం చెందుర్తి క్రాస్‌ నుంచి  ప్రారంభమై చేబ్రోలు, దుర్గాడ క్రాస్‌ వరకూ పాదయాత్ర సాగుతుంది.

మరిన్ని వార్తలు