రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్ కమిటీ
కోఆర్డినేటర్ తలశిల రఘురాం వెల్లడి
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేçపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం నాటి పాదయాత్ర వివరాలను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు పార్వతీపురం నియోజకవర్గంలోని సీతానగరం మండలం తామరఖండి రాత్రిబస వద్ద ప్రారంభమై చిన్నరాయుడుపేట వరకు పాదయాత్ర సాగుతుందన్నారు. తామరఖండి రాత్రిబస నుంచి బయలు దేరి చిన్నభోగిలి, సీతానగరం, అప్పయ్యపేట వరకూ సాగుతుందని చెప్పారు. అక్కడినుంచి మధ్యాహ్న భోజన విరామానంతరం జోగింపేట, గుచ్చిమి మీదుగా చిన్నరాయుడుపేట వరకు చేరుకుని ముగుస్తుందన్నారు. అక్కడే రాత్రిబస చేస్తారని పేర్కొన్నారు.