నేటి ప్రజాసంకల్పయాత్ర ఇలా....

23 Oct, 2018 08:25 IST|Sakshi

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్‌ కమిటీ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం వెల్లడి

సాక్షిప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేçపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారంనాటి పాదయాత్ర వివరాలను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రామ్స్‌ కమిటీ కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం తెలిపారు.  మంగళవారం సాలూరు నుంచి సన్యాసిరాజుపేట వరకు పాదయాత్ర సాగుతుందన్నారు. సాలూరు రాత్రిబస వద్ద ఉదయం 7.30 గంటలకు పాదయాత్ర ప్రారంభమై సీతమ్మదొరపాలెం క్రాస్, చంద్రప్పవలస క్రాస్, దేవబుచ్చమ్మపేట, వల్లాపురం మీదుగా సన్యాసిరాజుపేట చేరుకుని పాదయాత్ర ముగుస్తుందన్నారు. అక్కడే రాత్రిబస చేస్తారని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు