సాక్షి, తిరుమల/తిరుపతి అర్బన్: తిరుమల శ్రీవారి ఆలయంలో 2018 ఏప్రిల్లో నిర్వహించే వివిధ ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లను టీటీడీ శుక్రవారం విడుదల చేయనుంది. సాధారణ బుకింగ్ ద్వారా విశేషపూజ, కల్యా ణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్సేవ, వసంతోత్సవం, సహస్ర దీపా లంకార సేవ టికెట్లను పొందవచ్చు.
సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజపాద దర్శనం టికెట్లను లక్కీడిప్ పద్ధతిలో కేటాయించ నున్నారు. నేటి ఉదయం 10 గంటల నుంచి www.ttdsevaonline.com ద్వారా ఆన్లైన్లో టికెట్లకు ధరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు వారం పాటు గడువు ఉంటుంది. తర్వాత కంప్యూటర్ ర్యాండమ్ పద్ధతిలో లక్కీడిప్ ద్వారా భక్తులకు టికెట్లు కేటాయిస్తారు. టికెట్లు పొందిన భక్తులు నాలుగు రోజుల్లో నగదు చెల్లించాల్సి ఉంటుంది.