ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చేనేత కార్మికుల కోసం డిసెంబర్ 21 నుంచి ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపింది. అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. 40 రోజుల్లో విచారణ పూర్తిచేసిన ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది. గత 12 రోజులుగా సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు హైకోర్టులో ఊరట లభించింది. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పనిచేసిన సెప్టెంబర్ నెల జీతాలు .. సోమవారం లోపు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంను ఈడీ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.