ఈనాటి ముఖ్యాంశాలు

17 Nov, 2019 18:32 IST|Sakshi

తిరుమలలో లడ్డు ప్రసాదం ధరలను పెంచుతున్నారంటూ వస్తున్న వదంతులను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం ఖండించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆదివారం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశం ముగిసింది. ఈ భేటీకి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్‌ రెడ్డిలు హాజరయ్యారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం స్టేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో ఒకదాని వెనుక ఒకటి వరుసగా వెళుతున్న నాలుగు కార్లు, ఒక లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

>
మరిన్ని వార్తలు