ఈనాటి ముఖ్యాంశాలు

24 Nov, 2019 19:38 IST|Sakshi

 ప్రభుత్వం  ప్రవేశపెట్టిన ఇంగ్లీష్‌ మీడియం చదువులకు బీసీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. అనంతపురం ఎన్జీవో హోం లో రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.  చంద్రబాబు నాయుడు ఆర్ధిక క్రమశిక్షణ తప్పి వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ విమర్శించారు.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పథకాలతో సుభిక్ష పాలన అందిస్తున్నారని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు.  ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ నాయకుడు ఆశ్వర్థామరెడ్డి స్సష్టం చేశారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

మరిన్ని వార్తలు