ఈనాటి ముఖ్యాంశాలు

9 Dec, 2019 19:11 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన కేసుల్లో నిందితులకు సత్వరమే శిక్ష పడేలా చట్టాల్లో మార్పు తీసుకు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొనగా, ఆడపిల్లలకు కష్టం వస్తే..గన్‌ వచ్చే లోపే సీఎం వైఎస్‌ జగన్‌ వచ్చి శిక్షిస్తాడన్న ఒక నమ్మకం కావాలని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. మరోవైపు పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభలో  ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇదిలా ఉండగా, కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై దాఖలైన పిటిషన్‌ విచారణను హైకోర్టు ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. సోమవారం చోటుచేసుకున్న ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ఈ కింది వీడియో వీక్షించండి. 

మరిన్ని వార్తలు