ఈనాటి ముఖ్యాంశాలు

20 Oct, 2019 20:38 IST|Sakshi

రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.900 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదా అయిందని జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని ప్రాజెక్టుల్లో దాదాపు రూ.4 నుంచి 5వేల కోట్ల వరకు నిధులు ఆదా అవుతాయన్నారు.తెలంగాణ ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సంబంధించి హైకోర్టు ఆదేశానికి సంబంధించిన పూర్తి పాఠం ప్రతి ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. దీంతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీ సునీల్‌ కుమార్‌ శర్మ మరోసారి ప్రగతి భవన్‌కు వెళ్లారు.ఫేస్‌బుక్‌లో మిత్రులు, బంధువుల పోస్టులతో పాటు వార్తలు సైతం కనిపిస్తాయి. ఫేస్‌బుక్‌ అధికారికంగా తెస్తున్న ఈ వార్తలను ప్రత్యేక ఫీడ్‌ (ట్యాబ్‌)లో ఉంచనుంది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

>
మరిన్ని వార్తలు