ఈనాటి ముఖ్యాంశాలు

5 Oct, 2019 19:04 IST|Sakshi

ఆర్టీసీ కార్మికుల సమ్మె తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతోంది. సమ్మెపై తెలంగాణ కార్మిక సంఘాలు పట్టు వీడటం లేదు. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. గత సంవత్సరం నవరాత్రి రోజుల్లో మూలా నక్షత్రం రోజున తాను బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని ఓ కోరిక కోరుకున్నానని, అది తీరడంతో ఈ సంవత్సరం తిరిగి అమ్మను దర్శించుకుని, మొక్కు తీర్చుకున్నానని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా అన్నారు. వలసల్ని అడ్డుకోవటమే అజెండాగా మందుకెళుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ దిశాగ మరో నిర్ణయం తీసుకున్నారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో మరో సారి ఉగ్రవాదులు గ్రెనెడ్‌లతో దాడి చేశారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

మరిన్ని వార్తలు