ఈనాటి ముఖ్యాంశాలు

26 Oct, 2019 19:50 IST|Sakshi

ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన ప్రతిష్టాత్మక డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చారని వైయస్‌ఆర్‌సీపీ నేత, అగ్రిగోల్డు బాధితుల బాసట కమిటీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో యాజమాన్యం చర్చలు విఫలమయ్యాయి. షైన్‌ ఆసుపత్రి ఘటనపై హైకోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హరియాణా ముఖ్యమంత్రిగా మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ మరోసారి పగ్గాలు చేపట్టనున్నారు. అమెరికాలో దీపావళి వేడుకలు జరుపుకోవడం తమ దేశంలోని మత స్వేచ్ఛకు నిదర్శనమని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

>
మరిన్ని వార్తలు