దీపావళి పర్వదిన సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చీకటిమీద వెలుగు, చెడు మీద మంచి దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదివారం టీడీపీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై మరోసారి ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. కార్మిక సంఘాలతో శనివారం జరిగిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆదివారం హరియాణ ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ వరుసగా రెండోసారి పదవీ స్వీకార ప్రమాణం చేశారు. హరియాణ గవర్నర్ సత్యదేవ్ ఖట్టర్తో ప్రమాణం చేయించారు.ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.