ఈనాటి ముఖ్యాంశాలు

31 Oct, 2019 19:34 IST|Sakshi

సీనియర్‌ నటి గీతాంజలి(62)కన్నుమూశారు. వ్యవసాయ, ఉద్యానశాఖలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని స్వాగతించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో ముఖ్యమంత్రి జగన్‌ సక్సెస్‌ అయ్యారని అభినందించారు. హనీట్రాప్‌తో బాధితుడి నుంచి లక్షల రూపాయలు కొల్లగొట్టిన ఓ ఎయిర్‌హోస్టెస్‌ను, ఆమె భర్తను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఉక్కుమనిషి, దేశ తొలి హోంమంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పాకిస్తాన్‌లో గురువారం ఉదయం జరిగిన రైలు అగ్ని ప్రమాదంలో  65మంది సజీవ దహనమయ్యారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియోను క్లిక్‌ చేయండి.

మరిన్ని వార్తలు