ఈనాటి ముఖ్యాంశాలు

23 Aug, 2019 19:41 IST|Sakshi

లష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు శ్రీలంక మీదుగా తమిళనాడులో ప్రవేశించినట్లు ఇంటిలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. హిందువులుగా దేశంలోకి చొరబడి ఉగ్ర చర్యలకు కుట్ర పన్నుతున్నారని నిఘా వర్గాలు సమాచారమిచ్చాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న దాయాది దేశం పాకిస్తాన్‌కు అంతర్జాతీయంగా మరో ఎదురుదెబ్బ తగిలింది. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం చేస్తున్నారంటూ వస్తోన్న ఆరోపణలపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ విచారణకు ఆదేశించామని తెలిపారు. టిక్కెట్ల టెండర్‌ టీడీపీ హయాంలోనే ఖరారైనట్లు తెలిసిందన్నారు. యాదవుల పాలతోనే చంద్రబాబు హెరిటేజ్ పెట్టి వేల కోట్లు సంపాదించారని రాష్ట్ర్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. కులాన్ని కించపరిచేలా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.. ఇలాంటి వార్తల కోసం కింది వీడియో క్లిక్‌ చేయండి..

మరిన్ని వార్తలు