అమెరికాలో తయారైన అత్యాధునిక అపాచీ ఏహెచ్.. హెలికాప్టర్లు మంగళవారం భారత్ కు చేరాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూ కశ్మీర్ లో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పంచాయతీ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని భావిస్తున్న పాకిస్తాన్ ఆశలపై ఆ దేశ ఐసీజే న్యాయవాది ఖవార్ ఖురేషి నీళ్లు చల్లారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని మంగళవారం వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం సమస్యపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.