ఈనాటి ముఖ్యాంశాలు

12 Sep, 2019 20:21 IST|Sakshi

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సైనిక దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ గురువారం స్పష్టం చేశారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయింది. బాలాపూర్‌ వినాయకుడి లడ్డు వేలంలో 17 లక్షల 60వేలకు కొలను రాంరెడ్డి అనే భక్తుడు లడ్డును సొంతం చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించిన ఫలితాలను క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో హోం మంత్రి సుచరిత విడుదల చేశారు. రైతులకు పెన్షన్‌ అందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రధానమంత్రి కిసాన్‌ మన్‌ధన్‌ యోజనను గురువారం ప్రధాని నరేంద్ర మోదీ రాంచీలో ప్రారంభించారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

మరిన్ని వార్తలు