నేడు గవర్నర్ నరసింహన్ జిల్లా రాక

20 Apr, 2016 02:20 IST|Sakshi

చిత్తూరు (అగ్రికల్చర్): ఈ నెల 20,21 తేదిల్లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ జిల్లాలో పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మధ్యాహ్నం 12.40 గంటలకు హైదరాబాదు నుంచి బయలుదేరి 1.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి 1.50 గంటలకు బయలుదేరి 2.30 గంటలకు తిరుమల పద్మావతి అతిథిగృహం చేరుకుంటారు.



సాయంత్రం 4 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి 4.35 గంటలకు తిరుచానూరు చేరుకుని పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడ నుంచి 5.05 గంటలకు బయలుదేరి 7 గంటలకు కడపలోని స్టేట్ గెస్ట్‌హౌస్ చేరుకుంటారు. 21 తేది ఉదయం 7.30 గంటలకు కడప నుంచి బయలుదేరి 9 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని 9.45 గంటలకు హైదరాబాదు వెళతారని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.

మరిన్ని వార్తలు