నేడు కొత్త మాజేరుకు వైఎస్ జగన్ రాక

4 Aug, 2015 00:48 IST|Sakshi
నేడు కొత్త మాజేరుకు వైఎస్ జగన్ రాక

విషజ్వరాలతో మృతిచెందిన
వారి కుటుంబసభ్యులకు పరామర్శ

 
విజయవాడ : అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి మండలం కొత్తమాజేరులో విష  జ్వరాలతో మృతిచెందిన వారి కుటుంబాలను వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పరామర్శిస్తారు. ఉదయం హైదరా బాద్‌లో బయలుదేరి 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి చల్లపల్లి మీదుగా కొత్తమాజేరు గ్రామం వెళతారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ సోమవారం తెలిపారు. మృతుల కుటుంబాలతో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడతారని, గ్రామంలో జరిగిన పరిణామాలు తెలుసుకుంటారని  ఆయన వివరించారు.

గ్రామస్తులు కలుషిత నీరు తాగి విషజ్వరాల బారిన పడినా సకాలంలో స్పందించని అధికారుల తీరుపైనా వివరాలడిగి తెలుసుకుంటారని చెప్పారు. పరామర్శల అనంతరం అక్కడినుంచి బయలుదేరి సాయంత్రం ఐదు గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని, ఎయిరిండియా విమానంలో హైదరాబాద్ వెళతారని రఘురామ్ తెలిపారు.
 

మరిన్ని వార్తలు