చిత్తూరు కలెక్టరేట్ : ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సోమవారం జిల్లాకు రానున్నారు. ఈ మేరకు ఆదివారం కలెక్టరేట్కు ఉత్తర్వులు వచ్చాయి. ఉదయం 8.55 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 09.05 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 10.15 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి వైఎస్సార్ కడప జిల్లాలోని జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లికి వెళతారు. సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణభరత్గుప్త సంబంధిత అధికారులను, పోలీసులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి కే నారాయణస్వామి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, రెడ్డెప్ప, బల్లి దుర్గాప్రసాద్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు రేణిగుంట విమానాశ్రయంలో సీఎంకు స్వాగతం పలకనున్నారు.